45 వేలకు చేరువలో...
ABN , First Publish Date - 2020-10-02T07:03:00+05:30 IST
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 45 వేలకు చేరువలో ఉన్నాయి. కొత్తగా మరో 400 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది.
తాజాగా 400 పాజిటివ్ కేసులు
ముగ్గురు మృతి
కడప, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 45 వేలకు చేరువలో ఉన్నాయి. కొత్తగా మరో 400 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44,403కు చేరింది. మరో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు 448 మంది మరణించారు. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న 144 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు 40,462 మంది కరోనాను జయించారు. హోం ఐసోలేషన్ 2766 మంది చికిత్స పొందుతున్నారు.