క్లోరిన్తో అప్రమత్తంగా ఉండాలి : సీఈ
ABN , First Publish Date - 2020-10-01T06:37:24+05:30 IST
క్లోరిన్ వాయువు లీకేజి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆర్టీపీపీ చీఫ్ ఇంజనీర్ ఎల్.మోహనరావు హెచ్చరించారు. క్లోరిన్ వాయువు లీక్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై బుధవారం కర్మాగారం కాలనీలోని ఫౌంటేన్ వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఎర్రగుంట్ల, సెప్టెంబరు 30: క్లోరిన్ వాయువు లీకేజి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆర్టీపీపీ చీఫ్ ఇంజనీర్ ఎల్.మోహనరావు హెచ్చరించారు. క్లోరిన్ వాయువు లీక్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై బుధవారం కర్మాగారం కాలనీలోని ఫౌంటేన్ వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా క్లోరిన్ వాయువు దుష్ప్రభావాలు, వాటి వల్ల కలిగే విపత్కర పరిస్థితుల గురించి అధికారులు చంద్ర ఓబుళరెడ్డి, కృష్ణారెడ్డి, సత్యనారాయణ, జోనాథన్, విజయసారధి వివరించారు. కార్యక్రమంలో ఎస్ఈ శ్రీధర్, సీనియర్ సంక్షేమాధికారి తిరుమలరావు, ఎల్ఎంవి ప్రసాద్, వెంకటనరసయ్య, శ్రీనివాసరావు, రాధాక్రిష్ణ, కాలనీవాసులు పాల్గొన్నారు.