కడప: పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ABN , First Publish Date - 2021-08-15T15:31:50+05:30 IST
నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కడప: నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాష, జిల్లా కలెక్టర్ విజయరామ రాజు, ఎస్పీ అన్బురాజన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల కార్యక్రమాల వివరాలను మంత్రి సురేష్ తన సందేశంలో వినిపించారు.