YS Kondareddyని జిల్లా బహిష్కరణ చేసేందుకు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2022-05-12T01:17:07+05:30 IST

వైఎస్ కొండారెడ్డిని జిల్లా బహిష్కరణ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సీఎం జగన్ ఆదేశాలతో ఎస్ఆర్కే కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ

YS Kondareddyని జిల్లా బహిష్కరణ చేసేందుకు రంగం సిద్ధం

కడప: వైఎస్ కొండారెడ్డిని జిల్లా బహిష్కరణ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సీఎం జగన్ ఆదేశాలతో ఎస్ఆర్కే కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ కాంట్రాక్టర్‌ను బెదిరించిన కేసులో అరెస్టైన కొండారెడ్డిపై జిల్లా బహిష్కరణకు ప్రతిపాదనలు పంపారు. జిల్లా బహిష్కరణ చేయాలని కలెక్టర్‌కు ఎస్పీ అన్బురాజన్ ప్రతిపాదనలు పంపారు. ఈరోజే బెయిల్‌పై కొండారెడ్డి విడుదలైనారు. పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట భౌగోళికంగా పెద్ద మండలమేమీ కాదు. వైసీపీ ఇన్చార్జి కారణంగా ఈ మండలానికి జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ మండలానికి వైసీపీ ఇన్చార్జిగా వైఎస్‌ కొండారెడ్డి కొనసాగుతున్నారు. ఈ మండల పరిధిలోనే ఏ పని చేయాలన్నా ఈయన ఆశీస్సులు తీసుకోవాల్సిందే. రాయచోటి-వేంపల్లి రహదారి పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను బెదిరించిన కేసులో కొండారెడ్డిపై చక్రాయపేట పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 386, ఐపీసీ 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది. 

Read more