కడప: రిమ్స్ ఆస్పత్రిలో టీడీపీ నేతల ఆందోళన

ABN , First Publish Date - 2022-04-10T02:47:46+05:30 IST

రిమ్స్ ఆస్పత్రిలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు.

కడప: రిమ్స్ ఆస్పత్రిలో టీడీపీ నేతల ఆందోళన

కడప: రిమ్స్ ఆస్పత్రిలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. సరైన వైద్యం అందకే ముగ్గురు పిల్లలు చనిపోయారని నిరసన వ్యక్తం చేశారు. ధర్నా చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం సొంత జిల్లాలోనే ఇలాంటి ఘటన సిగ్గుచేటని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-04-10T02:47:46+05:30 IST