కడప కలెక్టర్కు పాజిటివ్
ABN , First Publish Date - 2020-09-29T18:11:23+05:30 IST
కలెక్టరు హరికిరణ్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కలెక్టరే స్వయంగా..
271 కరోనా కేసులు
ముగ్గురు మృతి
కడప(ఆంధ్రజ్యోతి): కలెక్టరు హరికిరణ్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కలెక్టరే స్వయంగా వెల్లడించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో స్వాబ్ పరీక్ష చేయించారు. సోమవారం పాజిటివ్ రిపోర్టు రావడంతో వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్ ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. వారం రోజులగా జిల్లాలో నాడు-నేడు పనులను పరిశీలించారు. పలు సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ క్రమంలో కలెక్టరు కరోనా బారిన పడ్డారని అధికారులు తెలిపారు. కాగా వారం రోజులుగా తనను కలసిన ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇక జిల్లాలో 271 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 43,417కు చేరింది. అలాగే ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు 442 మంది కరోనాతో మృతి చెందారు. కరోనా నుంచి కోలుకున్న 274 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు 39,744 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2273 మంది హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.