గోపవరం పోలింగ్ బూత్ దగ్గర వైసీపీ నేతల దౌర్జన్యం
ABN , First Publish Date - 2021-10-30T17:10:07+05:30 IST
జిల్లాలోని గోపవరం పోలింగ్ బూత్ దగ్గర వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు.
కడప: జిల్లాలోని గోపవరం పోలింగ్ బూత్ దగ్గర వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలింగ్ బూత్ నుంచి ఇతర పార్టీల ఏజెంట్ల పట్ల వైసీపీ నేతలు బెదిరింపులకు తెగబడ్డారు. బయటకు వెళ్లాలంటూ ఇతర పార్టీల ఏజెంట్లపై వైసీపీ నేతలు ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. పోలీసులు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పోలీసుల తీరుపై ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.