కడపలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-03-19T14:14:08+05:30 IST
జిల్లాలోని సంబేపల్లె మండలం ఎర్రగుంట్ల గురుకుల పాఠశాలలో అమృత(15) అనే టెన్త్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది.
కడప: జిల్లాలోని సంబేపల్లె మండలం ఎర్రగుంట్ల గురుకుల పాఠశాలలో అమృత(15) అనే టెన్త్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో విషద్రావణం తాగి విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించగా వెంటనే రిమ్స్కు తరలించారు. కాగా రిమ్స్లో చికిత్స పొందుతూ అమృత మృతి చెందింది. సరిగా చదవలేకపోతున్నానంటూ అమృత సూసైడ్ నోటు రాసింది. తమ కుమార్తె కొన్ని సబ్జక్ట్లు చదవలేక వెనుకబడడం వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.