కడపలో అక్రమంగా ఆవులు, ఎద్దుల తరలింపు
ABN , First Publish Date - 2022-03-15T17:30:40+05:30 IST
జిల్లాలోని పోరుమామిళ్ళలో అక్రమంగా తరలిస్తున్న ఆవులు, ఎద్దుల గూడ్సు వాహనాన్ని జనసేన, విశ్వహిందూ పరిషత్, ఏబివిపి నాయకులు అడ్డుకున్నారు.
కడప: జిల్లాలోని పోరుమామిళ్ళలో అక్రమంగా తరలిస్తున్న ఆవులు, ఎద్దుల గూడ్సు వాహనాన్ని జనసేన, విశ్వహిందూ పరిషత్, ఏబీవీపీ నాయకులు అడ్డుకున్నారు. గుంటూరు నుండి మైదుకూరు సంతకు తరలిస్తుండగా పోరు మామిళ్ళ పట్టణంలో లారీని అడ్డుకున్న నాయకులు పోలీసులకు అప్పజెప్పారు. తరచూ యధాతదంగా తరలిస్తున్న ఆవులు, ఎద్దులు అక్రమ రవాణాను అరికట్టాలని విశ్వహిందూ పరిషత్, ఏబీవీపీ, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.