Kadapa: జఠిలమవుతున్న అన్నమయ్య జిల్లా కేంద్రం వివాదం
ABN , First Publish Date - 2022-02-01T16:12:30+05:30 IST
రాజంపేటలో అన్నమయ్య జిల్లా కేంద్రం వివాదం రోజురోజుకు జఠిలమవుతోంది.
కడప: రాజంపేటలో అన్నమయ్య జిల్లా కేంద్రం వివాదం రోజురోజుకు జఠిలమవుతోంది. ఐదవ రోజు కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. రాజంపేట పట్టణంలోకి బయటి వ్యక్తులను రాకుండా అడ్డుకుంటున్నారు. నిరసనలో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో మన్నూరు నుంచి భారీ ర్యాలీ ప్రారంభమైంది. వైసీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ, అఖిలపక్ష నాయకులు ర్యాలో పాల్గొన్నారు.