సీబీఐ పేరిట మోసాలు... నలుగురి అరెస్ట్

ABN , First Publish Date - 2021-12-04T17:17:41+05:30 IST

సీబీఐ పేరిట మోసాలకు పాల్పడుతున్న నలుగురు ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

సీబీఐ పేరిట మోసాలు... నలుగురి అరెస్ట్

కడప: సీబీఐ పేరిట మోసాలకు పాల్పడుతున్న నలుగురు ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 23దీన ఖాజీపేట మండలం పత్తూరు గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్‌ను విచారణ పేరిట నిందితులు కారులో తీసుకెళ్లారు.  అక్కడక్కడా తిప్పుతూ అతని వద్ద నుండి 1.14 లక్షల రూపాయలను దండుకున్న దుండగులు మరుసటి రోజు వదిలిపెట్టారు. ఈ వ్యవహారంపై బాధితుడు ఉదయ్ కుమార్ చెన్నూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పట్టుబడ్డ నిందితులో కడప జిల్లాకు చెందిన ఇద్దరు, మరొకరు నెల్లూరు జిల్లా, ఇంకొకరు అనంతపురం జిల్లాకు చెందిన వారుగా విచారణలో వెల్లడైంది. గతంలో పోలీసు ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఏలూరులో ఓ వ్యక్తి వద్ద నవీన్ అనే నిందితుడు డబ్బులు చేసినట్లు తెలుస్తోంది. వీరి వద్ద నుండి రూ.84 వేల నగదు, ఉపయోగించిన కారును సీజ్ చేశామని, నకిలీ ఐడి కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-12-04T17:17:41+05:30 IST