Kadapa: ఇళ్ల కూల్చివేత... అడ్డుకున్న బాధితులు

ABN , First Publish Date - 2022-06-22T19:02:31+05:30 IST

నగరంలోని మృత్యుంజయ కుంటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Kadapa: ఇళ్ల కూల్చివేత... అడ్డుకున్న బాధితులు

కడప: నగరంలోని మృత్యుంజయకుంటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలువల విస్తరణలో భాగంగా ఇళ్ల కూల్చివేతను బాధితులు అడ్డుకున్నారు. జేసీబీ యంత్రానికి అడ్డుగా నిలబడి ఎమ్మార్వోను నిలదీశారు. ముందు నగరంలో జలమయమయ్యే ప్రాంతాల్లో కాల్వ విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధితులను నిలువరించే క్రమంలో పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దౌర్జన్యంగా ఇండ్ల కూల్చివేతను స్థానికులు ఖండించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. సీఎంకు మహిళలు శాపనార్థాలు పెట్టారు. ఓట్లు అడగడానికి వస్తారుగా...  అప్పుడు బుద్ధి చెబుతామని మహిళలు హెచ్చరించారు. 

Updated Date - 2022-06-22T19:02:31+05:30 IST