Kadapa: ఘరానా దొంగ గుట్టురట్టు చేసిన RIMS పోలీసులు

ABN , First Publish Date - 2022-06-11T18:16:37+05:30 IST

నకిలీ ఎంఎన్ఓ అవతారంలో చోరీలకు పాల్పడుతున్న దొంగను రిమ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Kadapa: ఘరానా దొంగ గుట్టురట్టు చేసిన RIMS పోలీసులు

కడప: నకిలీ ఎంఎన్ఓ అవతారంలో చోరీలకు పాల్పడుతున్న దొంగను రిమ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కడప శ్రీరామ్నగర్కు చెందిన మణిదీప్ కోవిడ్ సమయంలో ఏఎన్ఎమ్గా పనిచేసిన అనుభవాన్ని సద్వినియోగం చేసుకుని చోరీలకు తెరలేపాడు. మణిదీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు... నిందితుడి నుంచి 22 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులు లక్ష్యంగా చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడు. మత్తు ఇంజక్షన్ ఇచ్చి రోగుల ఒంటిపై బంగారు నగలు చోరీ చేశాడు. స్వీపర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘరానా దొంగను అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-06-11T18:16:37+05:30 IST