కడప: జిల్లాలోని ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు బాహాబాహికి దిగారు. సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు ఖాజా, ఇఫ్రాన్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డికి 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష మధ్య అభివృద్ధి పనులపై వాగ్వాదం చోటు చేసుకుంది. వైస్ చైర్మన్ బంగారు ముని రెడ్డికి మద్దతుగా మరో వైస్ చైర్మన్ ఖాజా మోహిద్దీన్, కౌన్సిలర్ గరిసపాటి లక్ష్మీదేవిలు కౌన్సిలర్ ఇర్ఫాన్ భాషపై దాడికి యత్నించారు. ఈక్రమంలో కౌన్సిలర్ల మధ్య తోపులాట జరిగింది. కౌన్సిల్ హాల్లోనే కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకుని బాహాబాహీకి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇవి కూడా చదవండి