కడపలో ఏబీఎన్ ఛానల్ తొలగింపుపై ప్రజల ఆగ్రహం
ABN , First Publish Date - 2021-02-25T13:51:01+05:30 IST
సీఎం జగన్ సొంత జిల్లాలో ఏబీఎన్ ఛానల్ తొలగింపుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కడప: సీఎం జగన్ సొంత జిల్లాలో ఏబీఎన్ ఛానల్ తొలగింపుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏబీఎన్ ప్రసారాలను కొనసాగించాలంటూ కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిళ్ళు పెరిగాయి. అయితే డబ్బులు చెల్లించడం లేదని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయంపై సీఎం జగన్ను కలుద్దామని వెళుతుంటే పోలీసులు అరెస్ట్ చేశారని, తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని ఆపరేటర్లు ప్రశ్నిస్తున్నారు.