వైసీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆరెంరెడ్డిపై దాడి
ABN , First Publish Date - 2020-09-26T23:13:30+05:30 IST
వైసీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆరెంరెడ్డిపై దాడి
సుండుపల్లె: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతపై అదే పార్టీకి చెందిన మరో నేత వర్గీయులు దాడి చేసిన సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... మండల కేంద్రం సమీపం లోని ఆరెమ్మ దేవాలయంలో వైసీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆరెంరెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా అనుచరులతో కలిసి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాయవరం గ్రామానికి చెందిన వైసీపీ నేత రఫీక్ నాలుగు ఆటోల్లో సుమారు 20 మందితో వచ్చి ఆరెంరెడ్డిపై కట్టెలతో ఒక్కసారిగా దాడి చేశారు. దీంతో ఆరంరెడ్డిని తప్పించబోయిన అతని కుమారుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ భక్తవత్సలం సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘర్షణ వ్యవహారంపై రెండు వర్గాలు ఎస్ఐకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దాడికి సంబంధించిన కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ భక్తవత్సలం తెలిపారు. అయితే వైసీపీ నాయకులు దాడులు చేసుకోవడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.