పెన్నాతీరంలో గుర్తు తెలియని శవం
ABN , First Publish Date - 2020-09-26T22:06:57+05:30 IST
పెన్నాతీరంలో గుర్తు తెలియని శవం
చెన్నూరు: మండలంలోని గుర్రంపాడు గ్రామ పంచాయతీ ఓబులంపల్లె పెన్నాతీరంలో గుర్తు తెలియని శవం పడి ఉండడాన్ని స్థానికులు గమనించి చెన్నూరు పోలీసులకు తెలిపారు. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు మృతుడి వయసు (55-60) మధ్య ఉండి, దాదాపు కుళ్లిపోయి ఉందన్నారు. శరీరం గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉండడంతో చెన్నూరు ఎస్ఐ తులసి నాగప్రసాద్ కేసు నమోదు చేసుకున్నారు. కాగా పెన్నానదికి వరద వచ్చినప్పుడు ఎవరైనా నదిలో దూకి చనిపోయారా ? లేక పడ్డారా అన్న విషయంపై విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.