kadapa: ప్రొద్దుటూరులో ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
ABN , First Publish Date - 2021-07-19T16:09:54+05:30 IST
ప్రొద్దుటూరులో త్రీటౌన్ పోలీస్స్టేషన్లో ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది.
కడప: ప్రొద్దుటూరులో త్రీటౌన్ పోలీస్స్టేషన్లో ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫోన్ కాల్ డేటాను బయటికి లీక్ చేశారని హెడ్ కానిస్టేబుల్ సుబ్బారెడ్డి, మరో కానిస్టేబుల్ శ్రీనివాసులను ఎస్పీ అన్బురాజన్ సస్పెండ్ చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కు చంపుతామని వచ్చిన బెదిరింపు కాల్స్పై పోలీసులు విచారణ చేపట్టారు.