Kadap: ఆర్టీసీ డిపో పునర్నిర్మాణ పనులకు శ్రీకారం

ABN , First Publish Date - 2022-01-05T16:33:41+05:30 IST

నగరంలోని ఆర్టీసీ డిపో పునర్నిర్మాణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు.

Kadap: ఆర్టీసీ డిపో పునర్నిర్మాణ పనులకు శ్రీకారం

కడప: నగరంలోని ఆర్టీసీ డిపో పునర్నిర్మాణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. రూ.9.68 కోట్ల వ్యయంతో ఆర్టీసీ డిపో పునర్నిర్మాణ పనులకు భూమి పూజ జరిగింది. బుధవారం ఉదయం డిప్యూటీ సీఎం అంజాద్ బాష, ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లి కార్జున రెడ్డిలు భూమి పూజ చేశారు. డిపో నిర్మాణంతో పాటు ఆర్‌ఎం కార్యాలయ అభివృద్ధి పనులకు రూ.12.26 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-05T16:33:41+05:30 IST