కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో రూ.52 లక్షలు పట్టివేత

ABN , First Publish Date - 2022-08-08T05:51:13+05:30 IST

కాచిగూడ-చెంగల్పట్టు ఎక్స్‌ప్రె్‌సలో వచ్చిన ఓ వ్యక్తి నుంచి పోలీసులు రూ.52 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం

కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో రూ.52 లక్షలు పట్టివేత

చెన్నై, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): కాచిగూడ-చెంగల్పట్టు ఎక్స్‌ప్రె్‌సలో వచ్చిన ఓ వ్యక్తి నుంచి పోలీసులు రూ.52 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం ఎగ్మూరు చేరుకున్న రైలు నుంచి దిగిన వ్యక్తి అనుమానాస్పదంగా తచ్చాడుతుండడాన్ని గమనించిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా నగదు వెలుగుచూసింది. ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలేవీ అతని వద్ద లేకపోవడంతోపాటు పొంతనలేని సమాధానాలివ్వడంతో పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకట దినేష్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-08-08T05:51:13+05:30 IST