రసవత్తరంగా కబడ్డీ పోటీలు

ABN , First Publish Date - 2020-02-19T10:41:02+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరుగుతున్న రాష్ట్ర సీనియర్‌ పురుషుల, మహిళల కబడ్డీ చాంపియన్‌షి్‌పలో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి.

రసవత్తరంగా కబడ్డీ పోటీలు

ఇల్లెందు (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరుగుతున్న రాష్ట్ర సీనియర్‌ పురుషుల, మహిళల కబడ్డీ చాంపియన్‌షి్‌పలో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. మంగళవారం జరిగిన పోటీల్లో పురుషుల విభాగంలో వికారాబాద్‌పై ఖమ్మం, పెద్దపల్లిపై మహబూబ్‌నగర్‌, భువనగిరిపై రంగారెడ్డి, వరంగల్‌ రూరల్‌పై భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌పై మేడ్చల్‌, యాదాద్రిపై నాగర్‌కర్నూల్‌, కామారెడ్డిపై వరంగల్‌ అర్బన్‌, ములుగుపై సిద్దిపేట, వనపర్తి రాజన్నపై సిరిసిల్ల గెలుపొందాయి. మహిళల విభాగంలో సిద్దిపేటపై వరంగల్‌ రూరల్‌, జగిత్యాలపై సూర్యాపేట, జగిత్యాలపై వరంగల్‌ రూరల్‌, నాగర్‌కర్నూల్‌పై నల్గొండ, సిరిసిల్లపై భూపాలపల్లి జట్లు నెగ్గాయి. 

Updated Date - 2020-02-19T10:41:02+05:30 IST