బాలికల కబడ్డీ జట్టు ఎంపిక
ABN , First Publish Date - 2021-10-26T07:35:23+05:30 IST
జిల్లాస్థాయి బాలికల కబడ్డీ జట్టును ఎంపిక చేసినట్లు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు మధు పేర్కొన్నారు.
చౌడేపల్లె, అక్టోబరు25: జిల్లాస్థాయి బాలికల కబడ్డీ జట్టును ఎంపిక చేసినట్లు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు మధు పేర్కొన్నారు. సోమవారం చౌడేపల్లె హైస్కూల్లో ఎంపిక పోటీలు నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన సదుంకు చెందిన గుల్జార్, చౌడేపల్లెకు చెందిన కావ్య, స్వప్న, పూజిత, కల్లూరుకు చెందిన పవిత్ర, మునికుమారి, అనిత, కత్తిరేపల్లెకు చెందిన మౌనిక, పుదిపట్లకు చెందిన హర్షిత, దాదేపల్లెకు చెందిన ముబారక్, మదనపల్లెకు చెందిన పవిత్ర, చిత్తూరుకు చెందిన దివ్యను ప్రధాన జట్టుకు ఎంపిక చేశారు. స్టాండు బై క్రీడాకారులుగా పుదిపట్లకు చెందిన జ్యోతిర్మయి, మేకలచిన్నేపల్లెకు చెందిన వినిత, మొలకలచెరువుకు చెందిన హేమలత, జాష్నా, అంజలి, నేతికుప్పంకు చెందిన షాలిని, దాదేపల్లెకు చెందిన షాజితా ఎంపికయ్యారు. కీడ్రాకారులకు కడియాల మురళి, మహేష్లు దుస్తులు పంపిణీ చేశారు. శిక్షణా సమయంలో భోజన వసతి, రవాణా వసతులను రంగబాబు, బసవరాజులు కల్పించనున్నట్లు తెలిపారు. ఎంపికైన జట్టు నవంబరు 6 నుంచి 8 వరకు విశాఖపట్నం జిల్లా అనకాపల్లెలో జరుగు ఏపీ అంతర్ జిల్లా పోటీల్లో పాల్గొననుంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామ్మూర్తి, జీడ్పీటీసీ దామోదర్రాజు, సర్పంచ్ వరుణ్ భరత్, స్కూల్ చైర్మన్ శంకర్రెడ్డి, హెచ్ఎం ఈశ్వర్రెడి,్డ పీడీలు రామచంద్రా, మల్రెడ్డి, వెంకటేశులు, రాజేంద్ర, మృదుల, మణి, రాజ, మాజీ క్రీడాకారులు, దొరస్వామి, రవి పాల్గొన్నారు.