జెన్‌కో కార్మికులను వీధిన పడేసిన జగన్‌

ABN , First Publish Date - 2022-07-05T03:24:20+05:30 IST

జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం కాంట్రాక్టు కార్మికులను సీఎం జగన్‌ వీధిన పడేశారని జెన్‌కో కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక నా

జెన్‌కో కార్మికులను వీధిన పడేసిన జగన్‌
ఆందోళన చేస్తున్న జెన్‌కో కార్మికులు, ఉద్యోగులు

ముత్తుకూరు, జూలై4: జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం కాంట్రాక్టు కార్మికులను సీఎం జగన్‌ వీధిన పడేశారని జెన్‌కో కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. సోమవారం నేలటూరు జెన్‌కో థర్మల్‌ కేంద్రం వద్ద జెన్‌కో ఉద్యోగులు, కార్మికులు అందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ థర్మల్‌ కేంద్రం నిర్మాణ సమయంలో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జగన్‌ హామీ ఇచ్చారన్నారు. నేటీకీ ఆ హామీ అమలుకు నోచుకోలేదన్నారు. కంటితుడుపుగా కొందరికి కాంట్రాక్టు కార్మికులుగా అవకాశం కల్పించార న్నారు. తెలంగాణా సీఎం కేసీఆర్‌ కాంట్రాక్టు కార్మికులకు పూలబాట వేస్తుంటే, ఆంధ్ర సీఎం జగన్‌ కార్మికులను రోడ్డుపై పడేశారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ తొందరపాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని, ప్రైవేటీకరణ ను రద్దు చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో జెన్‌కో కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక జేఏసీ నాయకులు, జెన్‌కో ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-05T03:24:20+05:30 IST