టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై High courtలో కేఏ పాల్ పిటిషన్
ABN , First Publish Date - 2022-04-27T18:42:22+05:30 IST
టీఆర్ఎస్ ప్లీనరీ పేరుతో నగరంలో భారీగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ప్రజాశాంతి పార్టీ ఫౌండర్ కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీ పేరుతో నగరంలో భారీగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ప్రజాశాంతి పార్టీ ఫౌండర్ కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను టీఆర్ఎస్ పార్టీ ఉల్లఘించిందని పాల్ పేర్కొన్నారు. రూల్స్కు విరుద్ధంగా ఉన్నవి తొలగించాలి అని పిటిషన్లో పేర్కొన్నారు. క్లాసిఫైడ్స్తో ప్రచారం చేసుకోవడం తప్పు కాదని, కానీ రోడ్డు మధ్యలో ఫ్లెక్సీలు పెట్టడం తప్పని పిటిషనర్ వాదనలు వినిపించారు. రోడ్లపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని కేఏ పాల్ హైకోర్టును కోరారు.