KCR అవినీతిపై సీబీఐకి KA Paul ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-06-22T17:32:54+05:30 IST

ప్రజాశాంతి పార్టీ(Prajashanthi Party) అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని సీబీఐ(CBI) కార్యాలయానికి చేరుకున్నారు.

KCR అవినీతిపై సీబీఐకి KA Paul ఫిర్యాదు

Delhi : ప్రజాశాంతి పార్టీ(Prajashanthi Party) అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. సీబీఐ డైరెక్టర్(CBI Director) సుబోద్ కుమార్ జైశ్వాల్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతిపై ఫిర్యాదు చేయనున్నట్టు అంతకు ముందు పాల్ వెల్లడించారు. రూ.9 లక్షల కోట్ల అవినీతికి కేసీఆర్, ఆయన కుటుంబం పాల్పడిందని... ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అవినీతి చూడలేదని ఫిర్యాదు కాపీలో పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబానికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపై దర్యాప్తు జరపాలని పాల్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉందన్నారు. కేసీఆర్ సర్కార్ నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఎమ్మెల్సీ కవితలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. తెలంగాణతో పాటూ సింగపూర్, దుబాయ్, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడ్డారన్నారు. ప్రాజెక్టు అంచనా బడ్జెట్ లక్షా 5 వేల కోట్లు కాగా.. 35 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పాల్ ఆరోపించారు. ఏకంగా రూ.75 వేల కోట్లు దోచుకున్నారన్నారు. యాదాద్రి అభివృద్ధిలోనూ అవినీతి జరిగిందన్నారు. రూ.2 వేల కోట్ల అంచనా కాగా.. 200 కోట్లు ఖర్చు చేసి మిగిలినదంతా దోచుకున్నారన్నారు. సీబీఐతో పాటూ కేంద్రమంత్రులు అమిత్ షా, పురుషోత్తం రూపాలాకు కేఏ పాల్ తన ఫిర్యాదు కాపీలను పంపారు.

Updated Date - 2022-06-22T17:32:54+05:30 IST