ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిల్ వేసిన కేఏ పాల్

ABN , First Publish Date - 2021-03-05T20:38:02+05:30 IST

ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ కేఏ పాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిల్ వేసిన కేఏ పాల్

విశాఖ: ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ కేఏ పాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జీపీఏ ద్వారా దాఖలైన పిల్ గురించి న్యాయం స్థానం ప్రశ్నించింది. దీంతో రూల్ నెంబర్ 4 ద్వారా పిల్ వేయవచ్చునని న్యాయవాది బాలాజీ చెప్పారు. కేఏ పాల్ పలు దేశాల్లో పర్యటిస్తుండడంవల్ల జీపీఏ వేశామని న్యాయమూర్తికి విన్నవించారు. అయితే జీపీఏ ద్వారా పిల్ వేయవచ్చా? లేదా అనేది వచ్చే వారం నిర్ణయిస్తామని న్యాయస్థానం పేర్కొంది. స్టీల్ ప్లాంట్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన మొట్టమొదటి వ్యక్తి కేఏ పాల్ అని ఫ్యాక్టరీ ఉద్యోగులు కొనియాడారు.

Updated Date - 2021-03-05T20:38:02+05:30 IST