నేను DGPని కలుస్తానంటే ఎందుకు అడ్డుకుంటున్నారు: KA Paul
ABN , First Publish Date - 2022-05-04T20:07:08+05:30 IST
సీఎం కేసీఆర్, మంత్రి కేటిఆర్ డిక్టేటర్లా వ్యవహరిస్తున్నారని కేఏ పాల్ అన్నారు.
Hyd: రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ డిక్టేటర్లా వ్యవహరిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ka paul విమర్శించారు. బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ తనపై సిరిసిల్ల ఎస్పీ సహాయంతో దాడికి ప్లాన్ చేశారని ఆరోపించారు. తాను డీజీపీని కలుస్తానంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. రెండు రోజులుగా తనను డీజీపీని కలవకుండా హౌస్ అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై హైకోర్టులో లంచ్ మోషన్ వేయబోతున్నానని కేఏ పాల్ చెప్పారు.