శ్రీకాకుళం జిల్లా ఏసీగా కె.శిరీష

ABN , First Publish Date - 2022-01-18T05:56:45+05:30 IST

దేవదాయ శాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌(ఏసీ)గా పదోన్నతి పొందిన కె.శిరీషను శ్రీకాకుళం జిల్లా ఏసీగా నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది

శ్రీకాకుళం జిల్లా ఏసీగా కె.శిరీష

విశాఖపట్నం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌(ఏసీ)గా పదోన్నతి పొందిన కె.శిరీషను శ్రీకాకుళం జిల్లా ఏసీగా నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రస్తుతం సీతమ్మధార షిర్డీసాయి గ్రూపు ఆలయాల ఈఓగా పనిచేస్తున్నారు. శ్రీకాకుళంలో మంగళవారం ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. అక్కడ డిప్యూటేషన్‌పై ఏసీగా పనిచేస్తున్న అన్నపూర్ణను తిరిగి అనకాపల్లి నూకాలమ్మ ఆలయ ఈఓ(ఏసీ కేడర్‌)గా నియమించారు. 


Updated Date - 2022-01-18T05:56:45+05:30 IST