సామాజిక విప్లవకారుడు జ్యోతిబాఫూలే
ABN , First Publish Date - 2020-11-29T04:20:57+05:30 IST
మహాత్మా జ్యోతి రావు ఫూలే సామాజిక విప్లవకారుడని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా ప్రధా న కార్యదర్శి మీసాల కుర్మయ్య అన్నారు.
ఫూలే వర్ధంతి సమావేశాల్లో వక్తలు
పాలమూరు, నవంబరు 28 : మహాత్మా జ్యోతి రావు ఫూలే సామాజిక విప్లవకారుడని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా ప్రధా న కార్యదర్శి మీసాల కుర్మయ్య అన్నారు. ఫూలే 129వ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం జిల్లా లోని పలు ప్రాంతాల్లో పూలే విగ్రహాలు, చిత్రప టాలకు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. బడుగు, బలహీన వర్గాల్లో చైతన్యం నింపేందుకు ఆయన కృషిని ఈ సందర్భంగా వక్తలు కొనియా డారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయ ఆవరణలో ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి ని వాళి అర్పించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో నాయకులు రామచంద్రయ్య, శ్రీను, సుగుణ, అలివేలు పాల్గొన్నారు.
బీసీ సేన ఆధ్వర్యంలో..
జడ్చర్ల : మండలంలోని బూర్గుపల్లి గ్రామంలో బీసీ సేన ఆధ్వర్యంలో ఫూలేవిగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో బీసీ సేన నాయకులు బూర్గుపల్లి కృష్ణయాదవ్, శరత్, నరసింహారెడ్డి, రామస్వామి, నాగులు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
డీఎస్పీ ఆధ్వర్యంలో...
నవాబ్పేట : ఫూలే వర్ధంతి సందర్భంగా న వాబ్పేటలో దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో ఆ యన చిత్రపటానికి నివా ళ్లు అర్పించారు. ఈ కార్య క్రమంలో డీఎస్పీ మండ ల కోఆర్డినేటర్ కోస్గి యా దయ్య పాల్గొన్నారు.
కోయిలకొండలో..
కోయిలకొండ : మండ ల కేంద్రంలో సర్పంచ్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో..
మిడ్జిల్ : మండల కేంద్రంలో కాంగ్రెస్పార్టీ నా యకులు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఎంపీటీసీగౌస్, నాయకులు సంప త్, ఆశోక్, భాస్కర్, రాము, అంజి ఉన్నారు.
గండీడ్ మండలంలో...
గండీడ్ : మహ్మదాబాద్లోని ఫూలే విగ్రాహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాలల ఐక్యవేదిక మండల అధ్యక్షు డు పత్తి గోపాల్, తలారి దస్తయ్య, అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు బోరు కృష్ణయ్య, రాజేశ్వర్, దానాకారి రవి పాల్గొన్నారు.
బాదేపల్లిలో...
బాదేపల్లి : ప్రభుత్వ డిగ్రీకళాశాలలో జ్యోతిరా వుపూలే వర్ధంతిలో ఉన్నత విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ రాజేంద్రసింగ్ పాల్గొని నివాళి అర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చిన్నమ్మ, అధ్యాపకులు డాక్టర్ సదాశివయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.