బొగ్గు రవాణాలో జేవీఆర్‌ ఓసీ కొత్త రికార్డు

ABN , First Publish Date - 2020-02-20T10:30:31+05:30 IST

జాతీయ సంపదను తరలించే క్రమంలో స్థానిక జేవీఆర్‌ ఓసీ మైన్‌ తన రికార్డును తానే అధిగమిస్తూ నూతన

బొగ్గు రవాణాలో జేవీఆర్‌ ఓసీ కొత్త రికార్డు

ఒక్కరోజులో 34,760 టన్నుల బొగ్గు రవాణా



సత్తుపల్లిరూరల్‌, ఫిబ్రవరి 19:జాతీయ సంపదను తరలించే  క్రమంలో స్థానిక జేవీఆర్‌ ఓసీ మైన్‌ తన రికార్డును తానే అధిగమిస్తూ నూతన రికార్డును నెలకొల్పింది. ఒక్కరోజులో 34,760 టన్నుల బొగ్గు రవాణ చేసి రికార్డును నెలకొల్పగా.. అదేరోజున రెండో షిప్టులో రిలే ‘బీ’లో 13,525టన్నుల బొగ్గు రవాణా చేసి ఒక్క షిప్టులో అత్యధిక బొగ్గు రవాణా సాధించిన రిలేగా నిలిచినట్టు బుధవారం ఓసీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా జీఎం సీహెచ్‌.నరసింహారావు, పీవో బీ.సంజీవరెడ్డిలు అభినందనలు తెలిపారు. 

Updated Date - 2020-02-20T10:30:31+05:30 IST