త్రికోటేశ్వరుని సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2021-06-14T06:11:45+05:30 IST

ప్రసిద్ధ కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.విజయలక్ష్మి కుటుంబ సమేతంగా సందర్శించారు.

త్రికోటేశ్వరుని సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్‌ కె.విజయలక్ష్మికి చిత్రపటాన్ని అందిస్తున్న ఈవో రామకోటిరెడ్డి

నరసరావుపేట రూరల్‌, పెదకాకాని, జూన్‌ 13: ప్రసిద్ధ కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.విజయలక్ష్మి కుటుంబ సమేతంగా సందర్శించారు. వారికి ఈవో అన్పరెట్టి రామకోటిరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని అందించారు. అదే విధంగా మండలంలోని ఇస్సపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీమహంకాళి అమ్మవారి ఆలయంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో జస్టిస్‌ కె.విజయలక్ష్మి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ అధికారి టి.సుధాకరరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు ఏలూరి అశోక్‌ బాబు, వంకా శ్రీనివాసరెడ్డి, మాలపాటి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   పెదకాకాని శ్రీభ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామిని జస్టిస్‌కె.విజయలక్ష్మి దంపతులు దర్శించుకున్నారు. దేవస్థాన సహాయ కమిషనర్‌ శ్యామల రఘునాఽథరెడ్డి స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ఆలా విజయశంకరి, బండ్లమూడి సాంబశివరావు, చదలవాడ జాలయ్య తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-06-14T06:11:45+05:30 IST