కనకమహాలక్ష్మిని దర్శించుకున్న జస్టిస్ నాగార్జునరెడ్డి
ABN , First Publish Date - 2022-01-28T05:03:16+05:30 IST
బురుజుపేటలో కొలువుదీరిన కనకమహాలక్ష్మి అమ్మవారిని ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి గురువారం దర్శించుకున్నారు.
విశాఖపట్నం, జనవరి 27: బురుజుపేటలో కొలువుదీరిన కనకమహాలక్ష్మి అమ్మవారిని ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి గురువారం దర్శించుకున్నారు. ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి వి.రాంబాబు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి విశేష పూజల అనంతరం వేదాశీర్వచనం నిర్వహించి ప్రసాదం అందజేశారు.