నాటుసారా మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి: గన్ని వీరాంజనేయులు

ABN , First Publish Date - 2022-03-12T22:37:54+05:30 IST

నాటుసారా మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని టీడీపీ నేత గన్ని వీరాంజనేయులు డిమాండ్ చేశారు.

నాటుసారా మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి: గన్ని వీరాంజనేయులు

పశ్చిమగోదావరి జిల్లా/జంగారెడ్డిగూడెం: నాటుసారా మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని టీడీపీ నేత గన్ని వీరాంజనేయులు డిమాండ్ చేశారు. నాటుసారా తాగి చనిపోయిన కుటుంబాలను జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు పదివేల రూపాయలు ఆర్థికసాయం చేశారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. కల్తీ సారా అమ్మేవారిని కఠినంగా శిక్షించాలని ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ ధర్నాలో టీడీపీ నేత గన్ని వీరాంజనేయులు, పలువురు నేతలు పాల్గొన్నారు. అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం మసీదు దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ మానవహారం చేశారు. ఈకార్యక్రమంలో చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, మండల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఇతర మండల నాయకులు, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



Updated Date - 2022-03-12T22:37:54+05:30 IST