మంతిన శ్రీనుకు న్యాయం చేయాలి’
ABN , First Publish Date - 2020-10-02T08:18:38+05:30 IST
ఒమ్మంగిలో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన టీడీపీ నాయకుడు, ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాల్ మంతిన శ్రీనుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సాయంత్రం /..
ప్రత్తిపాడు, అక్టోబరు 1: ఒమ్మంగిలో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన టీడీపీ నాయకుడు, ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాల్ మంతిన శ్రీనుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సాయంత్రం టీడీపీ ఆందోళన నిర్వహించింది. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వరుపుల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనగా పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. కేసు దర్యాప్తులో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఎస్ఐ అజయ్బాబును కోరారు. అనంతరం స్టేషన్ బయట వరుపుల రాజా మీడియాతో మాట్లాడారు. శ్రీనుపై తప్పుడు కేసు నమోదు చేస్తే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. అనంతరం ఉత్తరకంచిలో శ్రీనును రాజా పరామర్శించారు. కార్యక్రమాలలో కొమ్ముల కన్నబాబు, వెన్న శివ, ఏపూరి శ్రీను, మిరియాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.