మాకు న్యాయం జరిగేలా చూడండి

ABN , First Publish Date - 2022-05-25T05:29:08+05:30 IST

కాకినాడలో సుమారు 20 సం వత్సరాలుగా ఉన్న జయలక్ష్మి కోపరేటివ్‌ సొసైటీలో డిపాజిట్లుచేసి మోసపోయామని తమకు న్యాయం జ రిగేలా చూడాలని కోరుతూ మంగళవారం అనపర్తిలో ని టీడీపీ కార్యాయలంలో కాకినాడ నుంచి వచ్చిన బా ధితుల బృందం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

మాకు న్యాయం జరిగేలా చూడండి

 అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి వినతి 

అనపర్తి, మే 24 : కాకినాడలో సుమారు 20 సం వత్సరాలుగా ఉన్న జయలక్ష్మి కోపరేటివ్‌ సొసైటీలో డిపాజిట్లుచేసి మోసపోయామని తమకు న్యాయం  జ రిగేలా చూడాలని కోరుతూ మంగళవారం అనపర్తిలో ని టీడీపీ కార్యాయలంలో కాకినాడ నుంచి వచ్చిన బా ధితుల బృందం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు రామకృష్ణారెడ్డితో మాట్లాడుతూ ఈ సంస్థలో 70సంవత్సరాలు పైబడిని సీనియర్‌ సిటిజన్లు ఎక్కువ శాతం ఉన్నారన్నారు. చివరి అంకంలో ఆస రా గా ఉంచుకున్న సొమ్ములను సొసైటీలో డిపాజిట్‌ చే శామని, సంస్థ బోర్డు తిప్పేయడంతో ఎమిచేయాలో తెలియడం లేదని వారు వాపోయారు. ఐదు జిల్లాల్లో 29 బ్రాంచిలు ఉండగా కాకినాడలోనే 12 బ్రాంచిలు ఉన్నాయన్నారు. తాము ఆందోళనచేస్తే ఎట్టకేలకు కేసు నమోదు  చేశారని ఇప్పటికీ ఏబై రోజులు గడుస్తున్నా సొసైటీకి ఒక్కరిని  కూడా అరెస్ట్‌ చేయ లేదని అన్నా రు. విచారణకు 60రోజులు గడువు పెట్టారని ఇప్పటికే 50రోజులు గడి చినా విచారణ ముందుకు సాగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుంభకోణంలో ప్ర భుత్వ పెద్దల హస్తం కూడా ఉన్నట్లు భావిస్తున్నామని వారు రామ కృష్ణారెడ్డికి వివరించారు. ఇప్పటికే సంస్థ కు చెందిన కొన్ని ఆస్తులు రిజిస్ట్రేషన్లు కూడా జరిగి పోతున్నట్లు తమ దృష్టికి  వచ్చిందని ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళితే అటువంటిది ఏమీ జరగదని వారిపై చర్యలు కావాలా మీకు మీ సొమ్ము లు కావాలా అని ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఈ పరి స్థితులలో తమకు ప్రతిపక్షమే తమకు న్యాయం చేయ గలదని వారు అన్నారు. విషయాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకువెళ్ళి తమకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని వారు ఆయనను  కోరారు. రామకృ ష్ణారెడ్డి దృష్టి పెడితే తమ సమస్యకు పరి ష్కారం లభిస్తుందని నమ్ముతున్నామని అందుకే ఇంత దూరం వచ్చామని వారు అన్నారు.  ఈ సందర్భంగా రామకృ ష్ణారెడ్డి మాట్లాడుతూ జయలక్ష్మి కోపరేటివ్‌ సొసైటీ బాధితులకు  తెలుగుదేశంపార్టీ అండగా ని లుస్తుంద ని విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసు కువెళ్లడమే కాకుండా పార్టీ తరపున బాధితులకు అం డగా నిలుస్తామన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి వెంట జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు తమ లంపూడి సుధాకరరెడ్డి ఉన్నారు. 



Updated Date - 2022-05-25T05:29:08+05:30 IST