భాషాపండితులకు న్యాయం: ఎమ్మెల్సీ కవిత

ABN , First Publish Date - 2021-06-20T10:15:48+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చిన విధంగా జీవో 2, 3, 9, 10లు అమలయ్యేలా చూస్తామని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు.

భాషాపండితులకు న్యాయం: ఎమ్మెల్సీ కవిత

 హైదరాబాద్‌, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి):ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చిన విధంగా జీవో 2, 3, 9, 10లు అమలయ్యేలా చూస్తామని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేయాలని పండిత, పీఈటీ ఐక్యవేదిక ప్రతినిధులు మహ్మద్‌ అబ్దుల్లా, చక్రవర్తుల శ్రీనివాస్‌, కాంతికృష్ణ, గౌరీ శంకర్‌ రావు శనివారం ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులు కల్పించి ఎస్జీటీలకు కూడా న్యాయం చేస్తామని, న్యాయపరమైన చిక్కులు తొలగింపజేసి పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కవిత తెలిపారు. గౌ రవ వేతనాన్ని పెంచినందుకు వేములవాడ ని యోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆమెను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తె లంగాణ రాష్ట్ర రవాణా సంస్థ అద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను కలిసారు. వారు పలు సమస్యలను ప్ర స్తావించగా, మంత్రి పువ్వాడ అజయ్‌ దృష్టికి తీసుకెళ్తానని కవిత హామీ ఇచ్చారు.

Updated Date - 2021-06-20T10:15:48+05:30 IST