జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణ కేసుపై సుప్రీంకోర్టు తీర్పు
ABN , First Publish Date - 2021-04-13T00:07:34+05:30 IST
జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణ కేసుపై సుప్రీంకోర్టు తీర్పు
ఢిల్లీ: జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణ కేసుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఫోన్ సంభాషణను జస్టిస్ ఈశ్వరయ్య అంగీకరించినందున విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కుట్రకోణం విషయాలను హైకోర్టు తేలిస్తే సరిపోతుందని సుప్రీం పేర్కొంది. పిల్లో లేవనెత్తిన అంశాల జోలికి తాము వెళ్లడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.