ఏపీ హైకోర్టు పరిధి దాటి వ్యవహరిస్తోంది: జస్టిస్ చంద్రు
ABN , First Publish Date - 2021-12-11T02:41:20+05:30 IST
రాష్ట్రంలోని హైకోర్టు పని తీరుపై మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి
విజయవాడ: రాష్ట్రంలోని హైకోర్టు పని తీరుపై మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం శత్రువులు, ప్రత్యర్థులతో కాదు న్యాయవ్యవస్థతో యుద్ధం చేస్తోందన్నారు. అమరావతి భూస్కామ్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. కోర్టులు న్యాయం చేయాల్సిందిపోయి ఏదో చేయడానికి ప్రయత్నిస్తోందని జస్టిస్ చంద్రు అన్నారు.