గురువును సన్మానించిన జస్టిస్ చంద్రయ్య
ABN , First Publish Date - 2022-01-17T07:00:48+05:30 IST
గురువును మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య సన్మానించారు. 1964లో ఆదిలాబాద్ జిల్లాలోని తిమ్మాపూర్ గ్రామంలో చదువుకునే రోజుల్లో తనకు సైన్స్ పాఠాలను మీలా జగదీశ్వర్ బోధించారు.
సూర్యాపేట అర్బన్, జనవరి 16: గురువును మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య సన్మానించారు. 1964లో ఆదిలాబాద్ జిల్లాలోని తిమ్మాపూర్ గ్రామంలో చదువుకునే రోజుల్లో తనకు సైన్స్ పాఠాలను మీలా జగదీశ్వర్ బోధించారు. సూర్యాపేటలోని జగదీశ్వర్ ఇంటికి జస్టిస్ చంద్రయ్య శనివారం వచ్చారు. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ తాను ఈ స్థాయిని జీవితంలో గురువును మించిన దైవం ఉండదని అలాంటి శిష్యులు ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడు గురువుకు ఎన్నో కోట్ల ఆస్తులను కూడగట్టుకున్న వారవుతారన్నారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య. మాట్లాడుతూ గురువును మించిన దైవం లేదన్నారు. ఒక వ్యక్తి ఎంత ఉన్నతికి ఎదిగిన అతని వెనుక ఒక గురువు నేర్పిన విద్య కారణమన్నారు.