AP: జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామికి ఘనంగా వీడ్కోలు
ABN , First Publish Date - 2021-10-10T18:27:34+05:30 IST
చత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి న్యాయమూర్తులు, న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు పలికారు.
అమరావతి: చత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామికి న్యాయమూర్తులు, న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామికి పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.