న్యాయం, ధర్మం అమరావతి రైతుల పక్షాన ఉంది: లంకా దినకర్
ABN , First Publish Date - 2022-03-04T23:15:21+05:30 IST
న్యాయం, ధర్మం అమరావతి రైతుల పక్షాన ఉందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: న్యాయం, ధర్మం అమరావతి రైతుల పక్షాన ఉందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అందుకే అమరావతి రాజధానిగా కాపాడుకోగలుగుతున్నామని చెప్పారు. ప్రజా ధనం వృధా చేస్తూ రైతుల ప్రాధమిక హక్కులు తొక్కేస్తుంటే.. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశానని తెలిపారు. సీఆర్డీఏ చట్టం అమరావతికి రక్షణ వలయం అని చెప్పిన మాట నిజమైందని లంకా దినకర్ పేర్కొన్నారు.