ఉచిత న్యాయ సహాయం పొందాలి: న్యాయమూర్తి అభిషేక్ రెడ్డి

ABN , First Publish Date - 2021-11-13T21:48:51+05:30 IST

పేదవారు న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయం సహాయం

ఉచిత న్యాయ సహాయం పొందాలి: న్యాయమూర్తి అభిషేక్ రెడ్డి

సిద్దిపేట: పేదవారు న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయం సహాయం పొందాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి అభిషేక్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని సామాన్యులకు క్వాలిటీ లీగల్ ఎయిడ్ అందేలా చూడాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. సిద్దిపేటలో జరుగుతున్న న్యాయ సేవా సదస్సులో ఆయన మాట్లాడారు.  గ్రామాల్లో న్యాయసేవలపై విస్తృత ప్రచారం చేయాలని ఆయన సూచించారు. జడ్జిలు నాణ్యమైన, శ్రేష్టమైన ఉచిత న్యాయ సహాయాన్ని పేదవారికి న్యాయసేవాధికార సంస్థ ద్వారా అందించాలన్నారు. న్యాయ సేవలకు అర్హులైన వారు, కక్షిదారులు డబ్బును ఖర్చు చేసుకోకుండా ఉచిత న్యాయ సహాయం పొందాలన్నారు. దీని కోసం న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాలన్నారు. 

Updated Date - 2021-11-13T21:48:51+05:30 IST