మహిళా సాధికారిత చట్టాలపై న్యాయ విజ్ఞాన సదస్సు

ABN , First Publish Date - 2022-08-08T05:14:20+05:30 IST

నర్సీపట్నంలో ఆదివారం ఏపీ సాంఘిక పాఠశాలలో (బాలికలు) మహిళా సాధికరిత చట్టాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

మహిళా సాధికారిత చట్టాలపై న్యాయ విజ్ఞాన సదస్సు
న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి లీలావతి


నర్సీపట్నంఅర్బన్‌, ఆగస్ట్టు 7: నర్సీపట్నంలో ఆదివారం ఏపీ సాంఘిక పాఠశాలలో (బాలికలు) మహిళా సాధికరిత చట్టాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ సివిల్‌ జడ్జి లీలావతి మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం, వారి రక్షణకు అనేక చట్టాలను ప్రభుత్వం రూపొందించిందన్నారు. మహిళల గౌరవ మర్యాదలు, పనిచేసే ప్రదేశాల్లో మహిళా ఉద్యోగులకు రక్షణకు, బాలికలు అపహరణ, అక్రమ రవాణా వంటి అక్రమాలపై న్యాయ సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో టౌన్‌ ఎస్‌ఐ ధనుంజయనాయుడు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రావాడ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు సూరిబాబు, సీనియర్‌ న్యాయవాదులు నాగేశ్వరరావు,  కేవీ.రమణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T05:14:20+05:30 IST