జూరాలకు క్రమంగా పెరుగుతున్న వరద
ABN , First Publish Date - 2021-07-23T16:25:35+05:30 IST
ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేయడంతో జూరాల ప్రాజెక్ట్లోకి క్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది.
మహబూబ్నగర్: ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేయడంతో జూరాల ప్రాజెక్ట్లోకి క్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. అటు నారాయణపురం ప్రాజెక్టు నుంచి కూడా అవుట్ ఫ్లో క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు 15 గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాలలో ఐదు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం: 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 316.800 మీటర్లకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ: 6.401 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 1,13,000 క్యూసెక్కులు, మొత్తం ఔట్ ఫ్లో 1,23,867 క్యూసెక్కులుగా ఉంది. అలాగే దిగువకు 1,22,836 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు.