త్వరలో జేఎల్స్ ఇంటర్వ్యూలు
ABN , First Publish Date - 2020-10-20T15:00:57+05:30 IST
ఇంటర్మీడియెట్ విద్యలో జూనియర్ లెక్చరర్ (జేఎల్స్) పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు నిర్వహించిన ఆన్లైన్ మెయిన్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది.
ఇంటర్మీడియెట్ విద్యలో జూనియర్ లెక్చరర్ (జేఎల్స్) పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు నిర్వహించిన ఆన్లైన్ మెయిన్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఇంటర్వ్యూలకు రాష్ట్ర వ్యాప్తంగా 346 మంది అభ్యర్థులు ప్రొవిజినల్గా ఎంపికయ్యారు. అభ్యర్థుల వివరాలు http-s://psc.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయా అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, ఇంటర్వ్యూలు ఎప్పడన్నదీ త్వరలో తెలియజేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు.
వెబ్సైట్లో గ్రూప్-1 మెయిన్స్ హాల్టికెట్లు: నవంబర్ 2 నుంచి 13 వరకు జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ హాల్టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఏపీలోని 13 జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్లోనూ పరీక్షలు నిర్వహించనున్నారు.