నాసిరకం మాస్కులు ఇస్తున్నారంటూ జూడాల ఆవేదన

ABN , First Publish Date - 2020-08-13T03:05:20+05:30 IST

జీజీహెచ్ ఎదుట జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. నాసిరకం మాస్కులు, పీపీఈ కిట్లు ఇస్తున్నారని జూడాలు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జీజీహెచ్‌లో ఇప్పటికే 30 మంది జూడాలకు పాజిటివ్

నాసిరకం మాస్కులు ఇస్తున్నారంటూ జూడాల ఆవేదన

నెల్లూరు: జీజీహెచ్ ఎదుట జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. నాసిరకం మాస్కులు, పీపీఈ కిట్లు ఇస్తున్నారని జూడాలు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జీజీహెచ్‌లో ఇప్పటికే 30 మంది జూడాలకు పాజిటివ్ అని తేలిందని, ఇంత జరిగినా అధికారులు నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే విధులు బహిష్కరిస్తామని జూడాలు హెచ్చరికలు జారీ చేశారు.

Updated Date - 2020-08-13T03:05:20+05:30 IST