విధులు బహిష్కరిస్తాం: జూనియర్ డాక్టర్లు
ABN , First Publish Date - 2020-08-08T08:37:27+05:30 IST
ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు వైద్యసేవలందిస్తున్న తమ జీవితాలకు భద్రత కల్పించాలని, వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా
విజయవాడ, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు వైద్యసేవలందిస్తున్న తమ జీవితాలకు భద్రత కల్పించాలని, వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు సమ్మెకు సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోతే శనివారం నుంచే విధులు బహిష్కరిస్తామంటూ ఏపీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో పాటు రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు నోటీసులు పంపించారు. రాష్ట్రంలోని 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిధిలో ఉన్న దాదాపు 4వేల మంది హౌస్ సర్జన్లు, పీజీలు విధులను బహిష్కరించి ఆందోళనలో పాల్గొంటారని పేర్కొన్నారు.