జూనియర్‌ బాలబాలికల కబడ్డీ జట్టు ఎంపిక

ABN , First Publish Date - 2021-02-28T04:26:10+05:30 IST

పట్టణంలోని మినీస్టేడియంలో జిల్లా కబడ్డీ అ సోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం జూనియర్‌ బాలబాలికల కబడ్డీ జట్టు ఎంపిక జరిగింది.

జూనియర్‌ బాలబాలికల కబడ్డీ జట్టు ఎంపిక

ఆర్మూర్‌టౌన్‌ ఫిబ్రవరి27: పట్టణంలోని మినీస్టేడియంలో జిల్లా కబడ్డీ అ సోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం జూనియర్‌ బాలబాలికల కబడ్డీ జట్టు ఎంపిక జరిగింది. ఈ జట్టుకు మార్చి ఒకటి నుంచి సెయింట్‌పాల్స్‌లో శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. మార్చి 5, 6, 7వ తేదీల్లో జనగామలో జరగను న్న రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీలో పాల్గొంటారని జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అ ధ్యక్షుడు గంగామోహన్‌చక్రు, కార్యదర్శి మోహన్‌దాస్‌ తెలిపారు.

 ఎంపికైన బాలబాలికల జట్టు..

కళ్యాణ్‌, రాజేందర్‌, శ్రీనివాస్‌, నవీన్‌, వై.రాజేందర్‌, హరికృష్ణ, శివదత్తు, గు రుస్వామి, రాహుల్‌, అరుణ్‌, రాజేందర్‌ ఎంపికైంది. బాలికల జట్టు సుష్మ, ప్రియాంక, శ్రీవాణి, శ్రీవల్లి, సహనిక, సాత్విక, వినిత, పావని, శ్యామల రమ్య, వైష్ణవి, పూర్ణ, కావ్య, సంకీర్తనలు ఎంపికయ్యారు.

విద్యార్థులకు క్యాంపు నిర్వహణ 

మాక్లూర్‌: గుత్పలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం రాష్ట్ర స్థాయి సీనియర్‌ ఉమెన్‌ ఖోఖో కోచింగ్‌ క్యాంప్‌ను నిర్వహించినట్టు జిల్లా అధ్యక్షుడు అతికుల్లా తెలిపారు. ఒక్కో టీంలో 15మంది ఉంటారన్నారు.

కొనసాగుతున్న శిక్షణ 

ముప్కాల్‌: చైతన్య యూత్‌ క్లబ్‌ మైదానంలో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ విద్యార్థు లకు కబడ్డీ, ఖోఖో శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. క్రీడాకారులు సద్వి నియోగం చేసుకోవాలని నిర్వాహక కమిటీ సభ్యుడు సుబ్బారావు తెలిపారు.

Updated Date - 2021-02-28T04:26:10+05:30 IST