4న నౌకాయాన పర్యటన ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-26T14:14:21+05:30 IST

రాష్ట్రంలో నౌకాయాన పర్యటనను జూన్‌ 4వ తేదీన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించనున్నారు. ఈ పర్యాటక పథకాన్ని ఇదివరకే బడ్జెట్‌లో రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది.

4న నౌకాయాన పర్యటన ప్రారంభం

ఐసిఎఫ్‌(చెన్నై): రాష్ట్రంలో నౌకాయాన పర్యటనను జూన్‌ 4వ తేదీన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించనున్నారు. ఈ పర్యాటక పథకాన్ని ఇదివరకే బడ్జెట్‌లో రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి ప్రైవేటు నౌకా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 4వ తేది చెన్నైలో సీఎం నౌకాయాన పర్యటన ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో రెండు రోజులు నౌక సముద్రంలోనే వుంటుంది. ఈ నౌకాలో 600 మంది సిబ్బందితో పాటు, 1,800 మంది ప్రయాణించవచ్చు. అన్ని వర్గాలను అలరించే వినోదాంశాలు ఈ నౌకలో కల్పించారు.

Updated Date - 2022-05-26T14:14:21+05:30 IST