15 నుంచి బెంగళూరు-బీదర్ల మధ్య విమాన సేవలు
ABN , First Publish Date - 2022-05-27T18:07:25+05:30 IST
బెంగళూరు-బీదర్ నగరాల మధ్య విమాన సేవలు జూన్ 15 నుండి ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ఎరువులు రసాయనాల శాఖా మంత్రి భగవంత్ ఖూబా శుక్రవారం
బెంగళూరు: బెంగళూరు-బీదర్ నగరాల మధ్య విమాన సేవలు జూన్ 15 నుండి ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ఎరువులు రసాయనాల శాఖా మంత్రి భగవంత్ ఖూబా శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ రెండు నగరాల మధ్య వారానికి నాలుగు రోజులపాటు విమానాలు సంచరిస్తాయని ఇందుకు స్టార్ ఎయిర్ విమాన సంస్ధకు కేంద్ర పౌర విమానయాన సంస్ధ ఇప్పటికే అనుమతులు మంజూరు చేసిందన్నారు. 50 మంది ప్రయాణీకుల సామర్ధ్యం ఉన్న ఈ విమానాలలో సీట్లను రిజర్వుచేసుకోచ్చునని ప్రకటనలో సూచించారు.